Mlc Jayamnangala Venkataramana Fun: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య సరదా సంభాషణలు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా నేతల మధ్య ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, వైెఎస్సార్సీపీ ఎమ్మెల్సీల మధ్య సరదా సంభాషణ జరిగింది. తాను రోజూ జగన్ ఫోటోకు దండం పెట్టుకుంటానంటూ వెంకటరమణ చెప్పుకొచ్చారు. తనకు టీడీపీ టికెట్ ఇచ్చి ఉంటే మంత్రిని కూడా అయ్యేవాడిని అన్నారు.