కృష్ణా జిల్లా పామర్రులో ఓ ఆలయంలో చోరీ జరిగింది. పామర్రు మండలంలోని అడ్డాడలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ తాళాలు పగలగొట్టిన దొంగలు.. లోనికి ప్రవేశించి అందినకాడికి దోచుకెళ్లారు. హుండీ తాళాలు పగలగొట్టి చోరీ చేశారు. ఉదయాన్నే గుడికి వచ్చిన పూజారి.. తలుపులు తెరచి చూడగానే చోరీ జరిగిన విషయం తెలిసింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలయంలో చోరీ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.