ఉద్యోగుల ఖిల్లా ఈ సరంపేట తండా.. ఓటర్లు 230 మంది.. ఉద్యోగులు 190 మంది

4 months ago 8
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని సరంపేట తండా.. చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 230 మంది ఓటర్లున్న ఈ తండాలో 190 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 120 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వ్యవసాయంపై ఆధారపడిన ఈ తండా, చదువు విలువను గుర్తించి, తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి, ఉద్యోగాల దిశగా ప్రోత్సహించింది. కొన్ని కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉండటం నిజంగా విశేషం.
Read Entire Article