సీనియర్ ఐఏఎస్, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ అహ్మద్ బాబుపై హైకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అధికార దుర్వినియోగం, ఉద్యోగులపై వేధింపులు, న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించడం వంటి ఆరోపణలు చేస్తూ హైకోర్టులో ఏపీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ సందర్భంగా కోర్టు.. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకుండా ఫైళ్లను తొక్కిపెడుతుండటం, పన్నులు వసూళ్లలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపింది.