తెలంగాణ వైద్య, ఆరోగ్య రంగంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు, వైద్య సేవలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్థిక శాఖ అనుమతితో ఖాళీ పోస్టుల భర్తీతో పాటు, పెండింగ్లో ఉన్న పదోన్నతులపై ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా, 36 మంది సివిల్ సర్జన్లకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.