బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై స్పీకర్ విచారణ ముమ్మరం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు బుధవారం నోటీసులు జారీ చేయగా.. తాజాగా దానం స్పందించారు. తాను పార్టీ మారలేదని.. ఇంకా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగానే ఉన్నానని చెప్పారు. వ్యక్తిగత హోదాలోనే కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యానని సమర్థించుకున్నారు.