ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలలో శుక్రవారం వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలలో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు. ఎల్లుండి నుంచి రాయలసీమలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే పలు జిల్లాలలో ఎండల ప్రభావం ఉంటుందని.. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.