ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఉపాధి హామీ నిధులను విడుదల చేసింది. రూ.1805.24 కోట్లను ఏపీకి విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఎక్స్ వేదికగా వివరాలను పంచుకున్నారు. ఉపాధి హామీ పథకం నిధుల విడుదలకు సహకరించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ధన్యవాదాలు తెలియజేశారు.