జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈకేవైసీ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఆగస్టు 15 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది. ఈ కొత్త పద్ధతిలో కూలీలను ఫీల్ట్ అసిస్టెంట్లు రెండు సార్లు ఫోటోలను తీసి వాటిని సరిపోల్చి మాత్రమే వేతనాలు మంజూరు చేస్తారు. నకిలీ హాజరు, తప్పుడు ఫోటోల అప్లోడ్ వంటి మోసాలను నివారించి వేతనాల చెల్లింపుల్లో పారదర్శకత తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం.