ఉపాధి హామీ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి చేపట్టే పనుల గుర్తింపు కోసం గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియను నవంబర్ 30 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కూడా ఉపాధి హామీ కూలీల వలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా లబ్ధిదారులకు మేలు జరగడంతో పాటు నిర్మాణాలు వేగవంతం అవుతాయి. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం పనులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.