జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తెలంగాణకు కేంద్రం ఈసారి పనిదినాల కేటాయింపులో భారీగా కోత విధించింది. రాష్ట్రం 12 కోట్ల పనిదినాలు కోరగా, గత ఏడాది ఇచ్చిన 8 కోట్ల నుండి 6.5 కోట్లకు కుదించింది. అవసరాల మేరకే పనులు చేపట్టాలని కేంద్రం రాష్ట్రానికి స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికీ ఇబ్బందులు తప్పేలా లేవు.