ఉపాధి కూలీల హాజరు నమోదులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలకు అధికారులు చెక్ పెట్టారు. ఈ క్రమంలోనే ఆన్లైన్లో అటెండెన్స్ నమోదు చేయడంపై ఉన్న నిబంధనల సడలించారు. నెట్వర్క్ రాని చోట ఆఫ్లైన్లోనూ అటెండెన్స్ నమోదు చేసేందుకు అవకాశం కల్పించారు. అదే సమయంలో అంధులకు కంటి రెప్ప నిబంధన నుంచి విముక్తి కల్పించారు. ఈ-కేవైసీ పెండింగ్ ఉన్నా పని చేసేలా కూలీలకు వెసులుబాటు కల్పించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.