ఉపాధి హామీ పథకంలో నకిలీ హాజరుతో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. సినీ, టీవీ నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారుల ఫోటోలను పెట్టి వేతనాలు తీసుకుంటుంన్నారు. వీటిని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (NMMS) యాప్లో ఈ-కేవైసీ (e-KYC) విధానాన్ని అమలు చేయనుంది. ఈ కొత్త విధానంతో అక్రమాలకు చెక్ పడనుంది.