గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. కేటాయించిన దానికంటే ఎక్కువగా పనిదినాలు వినియోగింది. 2025-26 ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వం ఏపీకి 15 కోట్ల పనిదినాలు కేటాయించగా.. అందులో అక్టోబరు 30 నాటికే 15.66 కోట్ల పనిదినాలను ఉపయోగించుకుంది. పుదుచ్చేరి, రాజస్థాన్ తర్వాత స్థానంలో ఏపీ నిలిచింది. అయితే దేశంలో చాలా రాష్ట్రాలు పనిదినాల కేటాయింపులో 40 నుంచి 50 శాతం కంటే మించి వినియోగించకపోవడం గమనార్హం. కాగా, ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు.