తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్కు ఉపాసన కొణిదెల కో-ఛైర్మన్గా నియమితులయ్యారు. ఈ బోర్డుకు ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ గోయెంకా ఛైర్మన్గా వ్యవహరిస్తారు. క్రీడా రంగాలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఈ బోర్డును నియమించింది.తెలంగాణను ప్రపంచ క్రీడా శక్తిగా మార్చేందుకు కృషి చేస్తానని ఉపాసన ట్వీట్ ద్వారా తెలిపారు.