ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్కు మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటాన్ని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు అని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేని పేర్లు పెట్టడం చెల్లదని ఆయన వాదిస్తున్నారు. కారిడార్కు అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ.. జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభాకర్ ప్రభుత్వాన్ని కోరారు.