ఉప్పల్ మెట్రో స్టేషన్లో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ఉప్పల్ మెట్రో స్టేషన్లో బాంబు ఉందంటూ సిబ్బందిని బెదిరించాడు. దీంతో భయపడిన సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. స్టేషన్ మొత్తం గాలించి.. అక్కడ ఏమీ లేదంటూ తేల్చారు. దీంతో మెట్రో సిబ్బంది, ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.