చిన్నతనం నుంచి ఒకే ఊరిలో పెరిగి.. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఆ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అంతే కాదు.. చిన్ననాటి జ్ఞాపకాలు వదిలి వెళ్లాలంటే ఎవరి వల్ల కాదు కూడా. నారాయణ పేట జిల్లాలోని పల్లెగడ్డ గ్రామస్తుల పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. గ్రామం అంతా దేవాదాయ శాఖ పరిధిలో ఉందని.. గ్రామాన్ని ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో గ్రామస్థులు ఉన్న ఊరిని వదిలి వెళ్లలేమని.. మా ఊరు మాకు కావాలి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.