బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జవహర్ నగర్లో మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా కూల్చివేతలు పేదల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల జీవితాలతో చెలగాటమాడితే శాపం తగులుతుందని.. లంచాలు ఇవ్వకపోతే ఇళ్లను కూల్చేస్తున్నారని ఆరోపించారు. ఇది సరైన చర్య కాదని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.