భారీగా పెరుగుతున్న బంగారం ధరలు తెలంగాణలోని వర్సటీలకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టాయి. ధరలు పెరుగుతుండటంతో విద్యార్థులకు ఇచ్చే బంగారం పథకాల తయారీకి అధిక వ్యయం అవుతోంది. దీంతో డిపాజిట్ మెుత్తాన్ని పెంచాలని కోరుతూ వర్సటీ అధికారులు దాతలకు లెటర్లు రాస్తున్నారు. దాంతో పాటుగా గోల్డ్ మెడల్స్ తయారీలో గోల్డ్ వినియోగాన్ని గ్రాము వరకు తగ్గించి ఇతర లోహాలను కలిపి తయారు చేయిస్తున్నారు.