హైదరాబాద్ నగరంలో మరో భారీ ఆర్టీసీ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. గాజుల రామారంలో ఏకంగా 100 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలు, హంగులతో ఈ ఆర్టీసీ బస్ టెర్మినల్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ బస్సుల కోసం స్పెషల్ ఛార్జింగ్ స్టేషన్లతోపాటు సిటీ బస్లకు ప్రత్యేక టెర్మినల్ నిర్మించనున్నారు. జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులతో హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ నెలకొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.