తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. ఆదిలాబాద్లో మంగళవారం రికార్డు స్థాయిలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాగల రెండు రోజుల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.