రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదనే మనస్తాపంతో అశోక్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు కారణం కాంగ్రెస్ నాయకుడు, తన బావ బండ యాదగిరి అని, ఇందిరమ్మ ఇల్లు గురించి అంటూ అశోక్ తన చేతిపై రాసుకొని ఉరి వేసుకున్నాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.