Warangal crime news | గ్రామంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడు దృశ్యం సినిమా తరహాలో గ్రామస్థులు, పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ప్రశాంత్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి దాడిలో స్పృహ కోల్పోయిన ఏడు నెలల గర్భిణి.. కోలుకొని నిజం చెప్పడంతో బండారం బయటపడింది. నిందితుడి నుంచి 8 తులాల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు.