Narayanpet Kodangal Project Compensation: మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూసేకరణలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కాట్రేపల్లి, ఎర్నాగానిపల్లి గ్రామాల రైతులు తమ భూములకు ఎకరాకు రూ.70 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని చెప్పినా రైతులు అంగీకరించలేదు. దీంతో అధికారులు వెనుదిరిగారు.