ఎకరాల కొద్దీ భూములున్నా, 22ఎ జాబితాలో ఉండటంతో అమ్ముకోలేక, వారసులకు పంచలేక భూ యజమానులు నరకం చూస్తున్నారు. అసైన్డ్ భూములు, స్వాతంత్ర్య సమరయోధుల భూములు చేతులు మారినా, వైకాపా ప్రభుత్వం ఫ్రీహోల్డ్లో పెట్టి అమ్మకాలు ఆపేసింది. సరైన పత్రాలున్నా ఇబ్బందులు పడుతున్న బాధితులు, కొత్త ప్రభుత్వం తమ గోడు వింటుందని ఆశిస్తున్నారు. పెదవేగిలో 15 వేల ఎకరాల్లో ఈ సమస్య ఉంది.