తెలంగాణ కేబినెట్ సమావేశంలో మంత్రి సీతక్క చేసిన కృషి ఫలించింది. ములుగు జిల్లా అభివృద్ధికి అటవీశాఖ అనుమతులు లభించాయి. కొత్త రోడ్ల నిర్మాణం, 30 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. తాడ్వాయి, ఏటూరు నాగారంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక వాహనాలు మంజూరయ్యాయి. ప్రతిపక్షాల విమర్శలను సీతక్క ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.