తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు ఏరియాల్లో పనులు కూడా ప్రారంభం అయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో డీపీఆర్లు సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగానే.. నిజామాబాద్ జిల్లాలోని బోధన్-నిజామాబాద్ మధ్య నిర్మించనున్న నాలుగు వరుసల రహదారిని వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. నెల రోజుల్లోపు డీపీఆర్ రూపొందించి.. వెంటనే పనులు ప్రారంభించాలనేది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్లాన్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.