రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగాన్ని (162 కి.మీ) కేంద్రం చేపట్టేందుకు సిద్ధమైంది. రూ.18,600 కోట్ల బడ్జెట్కు ఈ నెలాఖరున పీపీపీఏసీ ఆమోదం లభించనుంది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని.. మొదట నాలుగు వరుసలకు బదులు, ఏకకాలంలో ఆరు వరుసల మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు. టెండర్లు తెరిచిన తర్వాత, మే నెలలో పనులు ప్రారంభం కానున్నాయి. ఔటర్ రింగ్ రైలు మార్గం, దక్షిణ రింగు భాగంపై ఇంకా గందరగోళం కొనసాగుతోంది.