NHAI Flyover At Ranasthalam Works Speed Up: ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల పనులు జోరుగా సాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.242 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. గతంలో బైపాస్ వివాదాలతో ఆగిపోయిన పనులు ఇప్పుడు పైవంతెన రూపంలో ముందుకు సాగుతున్నాయి. మొన్నటి వరకు వర్షాలు ముంచెత్తగా.. కొద్ది రోజులుగా వర్షాలు తగ్గడంతో పనులు వేగవంతమయ్యాయి. ఈ నెల 11 నుంచి ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు.. అలాగే నిర్మాణంలో 15 శాతం పూర్తయింది.