Nellore Pottepalem Kaluju Bridge: నెల్లూరు రూరల్ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది! పొట్టేపాళెం కలుజు వద్ద వంతెన నిర్మాణానికి సాంకేతిక అనుమతులు లభించాయి. రూ. 4.80 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. మూడు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలను అధిగమించి, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషితో ఈ కల నిజం కానుంది.