ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఏపీలో కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. పుట్టపర్తి - చిక్బళ్లాపూర్ మార్గంలో 713 కోట్ల రూపాయలతో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం కేంద్రం ఆమోదం తెలిపినట్లు హిందూపురం ఎంపీ పార్థసారథి తెలిపారు. పుట్టపర్తి - చిక్బళ్లాపూర్ రైల్వే లైన్లో భాగంగా ఏపీలో నాలుగు రైల్వే స్టేషన్లు, కర్ణాటకలో మూడు రైల్వే స్టేషన్లు నిర్మించేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ రైల్వే లైన్ పూర్తి అయితే ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందంటున్నారు.