దేశంలో మావోయిస్ట్ ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్రం 'ఆపరేషన్ సంభవ్' చేపట్టింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్ట్లు లేకుండా చేస్తామని కేంద్రం శపథం చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోనూ మావోయిస్టుల ఏరివేత ముమ్మరమైంది. మారేడుమిల్లిలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో అగ్రనేత మద్వి హిడ్మా, అతని భార్య రాజక్క కూడా ఉన్నారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రాన్ని నక్సల్స్ రహితంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు.