Kaikaluru Merge In Krishna District: ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది. కొన్ని నియోజకవర్గాలను పొరుగు జిల్లాల్లో విలీనం చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. మార్కాపురం, మదనపల్లెలను కొత్త జిల్లాల కేంద్రాలుగా, పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రతిపాదనలపై బుధవారం సమావేశంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు. విలీనానికి సంబంధించిన ఆ వివరాలు ఇలా ఉన్నాయి.