Kesineni Nani Post On Kesineni Chinni: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని, తన సోదరుడు, ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ భవన్ పేరుతో చిన్ని ఇసుక వ్యాపారం, భూ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చి 'చార్లెస్ శోభరాజ్ భవన్' అని పెట్టాలని విజయవాడ ప్రజలు కోరుకుంటున్నారని ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వ్యంగ్యంగా అన్నారు. గతంలో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.