గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP)లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు సంస్థలోని 3974 మంది ఉద్యోగులకు వంద శాతం బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్దాలుగా బదిలీలు లేకపోవడంతో, సంస్థాగత పనితీరును మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బదిలీలు సంస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని ప్రభుత్వం భావిస్తోంది.