పోలీసుల తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల సీఐ బీజేపీ శ్రేణులపై దాడి చేశారని ఆరోపించిన బండి సంజయ్.. ఆయనను వెంటనే విధుల్లో నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు పద్దతి మార్చుకోకపోతే తానే రంగంలోకి దిగుతానని తేల్చి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు.