టీడీపీ ఎమ్మెల్యే , ఆమదాలవలస శాసనసభ్యుడు కూన రవికుమార్ మీద ఆరోపణలు చేసిన కేజీబీవీ ప్రిన్సిపల్ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. కేజీబీవీ ప్రిన్సిపల్ ఆత్మహత్యకు యత్నించారనే ప్రచారం జరుగుతోంది. ఆస్పత్రిలో బెడ్ మీద చికిత్స పొందుతున్న ఫోటోను వైసీపీ షేర్ చేసింది. టీడీపీ తనపై చేస్తున్న నెగటివ్ ట్రోలింగ్ తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు యత్నించారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అయితే టీడీపీ శ్రేణులు దీనికి కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న కూన రవికుమార్.. అమెరికా నుంచి రాగానే ఈ ఘటనపై అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.