గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై బీజేపీ నేత మాధవీ లత విమర్శలు గుప్పించారు. రాజాసింగ్ బీజేపీని ఎందుకు వీడారో ఆయనకే తెలియాలన్నారు. గతంలో తనపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో, ఫాతిమా కాలేజీ విషయంలో ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అవకాశం ఇస్తే పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో రాజాసింగ్ కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆమె గుర్తు చేశారు.