శాసనసభ్యులకు ఆటవిడుపుగా ఆట లపోటీలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ్యులకు క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. మూడు రోజులపాటు వీటిని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగినవారు చీఫ్ విప్, విప్లకు పేర్లు ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. నిత్యం ప్రజాసమస్యల పరిష్కారానికి పనిచేసే శాసనసభ్యులకు కాస్త ఆటవిడుపుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఇందులో వైసీపీ పాల్గొంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.