టీడీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. కొందరు ఎమ్మెల్యేలు వారి మాటలు, చేతలతో పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వివాదాల్లో నిలుస్తున్న పలువురు ఎమ్మెల్యేలను స్వయంగా పిలిచి మాట్లాడానని తెలిపారు. ఎవరికైనా సరే 2 సార్లు మాత్రమే ఛాన్స్ ఇస్తానని.. ఆపై కూడా తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి.. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు.