ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. రెండు సార్లు మాత్రమే ఛాన్స్.. ఆపై

6 months ago 10
టీడీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. కొందరు ఎమ్మెల్యేలు వారి మాటలు, చేతలతో పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వివాదాల్లో నిలుస్తున్న పలువురు ఎమ్మెల్యేలను స్వయంగా పిలిచి మాట్లాడానని తెలిపారు. ఎవరికైనా సరే 2 సార్లు మాత్రమే ఛాన్స్ ఇస్తానని.. ఆపై కూడా తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి.. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు.
Read Entire Article