ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలను నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంచేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిసింది. అందులో భాగంగా ఎమ్మెల్యేలకు టైమ్ టేబుల్ రూపొందించినట్లు సమాచారం. పింఛన్ల పంపిణీలో పాల్గొనడం దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల సందర్శన, అన్న క్యాంటీన్ల భోజనం వరకూ చాలా అంశాలను పరిశీలించేలా ఈ టైమ్ టేబుల్ ఇచ్చినట్లు తెలిసింది. తప్పనిసరిగా వీటిని పాటించాలని పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.