తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గేట్ వద్ద జరిగిన ఉద్రిక్తతలపై హైకోర్టు జోక్యం చేసుకుంది. పోలీసుల తీరును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. సభకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోరాదని స్పష్టం చేసింది. సభలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కే ఉంటుందని పేర్కొంది. మహిళా ఎమ్మెల్యేలపై దాడి ఆరోపణలను సీరియస్గా తీసుకున్న కోర్టు.. బాధ్యులైన పోలీసులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించింది.