ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో శనివారం రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు లక్ష్మీదుర్గపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ కేసులో లక్ష్మీదుర్గను సిట్ ఏ2గా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిట్ అధికారులు రాజమహేంద్రవరం కోర్టులో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం లక్ష్మీ దుర్గపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.