సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో పాటు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎల్పీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవటంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. అందుకు కారణాలు చెప్పుకొచ్చారు.