ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానానికి నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు, లోకేష్ చేరుకుని ఓటు వేశారు. ఎన్నికల్లో ఓటు వేయడం ఓ బాధ్యతని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. ప్రజాస్వామ్య దేశంలో ఓటు పెద్ద ఆయుధం అన్నారు అందరూ బాధ్యతతో వేయాల్సిన అవసరముందని.. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతామన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ (కూటమి) కేఎస్ లక్ష్మణరావు (పీడీఎఫ్) మధ్య ప్రధాన పోటీ ఉంది.