తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల పాటు దీక్ష చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. 42 శాతం రిజర్వేషన్లు ఉన్న బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరును ఆమె తప్పుబట్టారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా రావాలని ఆమె ఆకాంక్షించారు.