వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై గతంలో దువ్వాడ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర నెలకి రూ.50 కోట్లు తీసుకున్నారని.. అందుకే ఆయనని ప్రశ్నించడం లేదని దువ్వాడ ఆరోపించారు. దీనిపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హిరమండలం పోలీస్ స్టేషన్లో జనసేన నాయకుడు ఒకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దువ్వాడ మీద కేసు నమోదు చేశారు.