బీసీసీఐ మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. భారత మహిళా క్రికెటర్ శ్రీచరణికి స్వాగతం పలికే సమయంలో గన్నవరం ఎయిర్పోర్టులో జరిగిన ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెస్కే ప్రసాద్, ఏసీఏ సెక్రటరీ సానా సతీష్తో చంద్రబాబు మాట్లాడినట్లు సమాచారం . ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ సానా సతీష్ మీద చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.