ఎయిర్పోర్ట్కు దగ్గర్లో భూముల ధరలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు ఎలాంటి డిమాండ్ లేకుండా ఉన్న భూములకు ఊహించని విధంగా ధరలు పలుకుతుంటాయి. పట్టా భూములు ఉన్నవారికి పండగే కానీ.. ప్రభుత్వ భూమిని కూడా మన భూమే అని చూపించుకునే వాళ్లను ఏమనాలి..? ఇక్కడ అదే జరిగింది. ఎసైన్డ్ భూములను తమ ప్రముఖ సంస్థ వెంచర్లో కలిపేసుకుంది. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని మంఖా రెవెన్యూ పరిధిలో చోటు చేసుకుంది.